హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం రామగుండం నియోజకవర్గం 2023 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్, వరంగల్ ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ను కలిశారు. రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. గోదావరిఖనిలో 600 మంది ఆర్టీసీ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని వారి కుటుంబాల్లో శుభ కార్యాల కోసం ప్రైవేటు ఫంక్షన్ హాల్, ఆర్టీసీ ద్వారా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని విన్నవించారు.