ముఖ్యమంత్రి కేసీఆర్కు రాఖీ కట్టిన సోదరీమణులు
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రగతిభవన్లో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు కుటుంబసభ్యులు పాల్గొన్నా రు. సీఎం కేసీఆర్కు తోబుట్టువులు లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ రాఖీలు కట్టి, ఆశీర్వదించారు. సీఎం మనుమడు హిమాన్షుబాబుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టారు. వేడుకల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.