వరంగల్: అగ్నిపథ్ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ అంతిమయాత్ర కొనసాగుతున్నది. వరంగల్లోని ఎంజీఎం నుంచి ఆయన స్వస్థలమైన దబీర్పేట వరకు జరుగనుంది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతిమయాత్రలో పార్టీ నేతలు, స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బీజేపీ విధానాలు, ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పులను నిరసిస్తూ నల్లజెండాలతో యువత భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతిమయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, అంతిమయాత్ర 60 కిలోమీటర్ల మేర కొనసాగనున్నది. మధ్యాహ్నం ఖానాపురం మండలంలోని దబీర్పూర్లో రాకేశ్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
అంతిమ యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోచం మైదాన్ చౌరస్తాలో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై పలువురు దాడిచేశారు.