హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారిగా రాకేశ్ మోహన్ డోబ్రియాల్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన అరణ్యభవన్లో బాధ్యతలు స్వీకరించారు.
గతంలో పనిచేసిన పీసీసీఎఫ్ విరమణ పొందడంతో ఇటీవలే డోబ్రియాల్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. తాజాగా ఆయనను పూర్తిస్థాయి పీసీసీఎఫ్గా నియమించింది.