హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. అసెంబ్లీలో ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 16న పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ధ్రువపత్రాలను అందిస్తారు.
లేకుంటే ఈ నెల 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్నది. ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్కు రెండు స్థానాలు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కే అవకాశాలున్నాయి.