HomeTelanganaRajesh Family Rs The Photojournalist Association Gave One Lakh Rupees
ఆందోళనకరస్థితిలో జర్నలిస్టుల జీవితాలు
వృత్తిలో సవాళ్లు, విపరీతమైన పని ఒత్తిడి, తక్కువ వేతనాలతో జర్నలిస్టుల జీవితాలు ఆందోళనకర స్థితిలోకి పడిపోతున్నాయని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి ఆవేదన
బషీర్బాగ్లో ఫొటో జర్నలిస్టు రాజేశ్ సంస్మరణ సభ
రాజేశ్ కుటుంబానికి ఫొటో జర్నలిస్టు సంఘం రూ.లక్ష అందజేత
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): వృత్తిలో సవాళ్లు, విపరీతమైన పని ఒత్తిడి, తక్కువ వేతనాలతో జర్నలిస్టుల జీవితాలు ఆందోళనకర స్థితిలోకి పడిపోతున్నాయని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్బాగ్లో తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం.. ఇటీవల గుండెపోటుతో మృ తిచెందిన యువ ఫొటో జర్నలిస్టు నర్రె రాజేశ్ సంస్మరణ సభ నిర్వహించింది. సంఘం అధ్యక్షుడు అనుమల్ల గంగాధర్ అధ్యక్షత వహించిన ఈ సభలో శ్రీనివాస్రెడ్డి.. సం ఘం తరఫున నర్రె రాజేశ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు. ఫొటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు కష్టనష్టాలను పట్టించుకోకుండా వారిచుట్టూ ఉన్న కఠినమైన వాస్తవ చిత్రాలను ప్రపంచం ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. నర్రె రాజేశ్ భార్యకు పింఛన్తోపాటు పిల్లలకు విద్యను అందించేందుకు మీడియా అకాడమీ సాయం చేస్తుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్అలీ, తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి కే ఎన్ హరి, కోశాధికారి అనిల్, జేఎన్జేహెచ్ఎస్ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్ కుమార్, ఇండియన్ ఎక్స్ప్రెస్ మాజీ చీఫ్ ఫొటోగ్రాఫర్ ఆర్వీ కోటేశ్వరరావు, ఈనాడు చీఫ్ ఫొటోగ్రాఫర్ వసంత్, తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు హృదయానంద్, ప్రధాన కార్యదర్శి వీరగోని రజినీకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.