హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ శాఖ ప్రణాళికా విభాగంలో పెద్ద ఎత్తున బదిలీలు చేశారు. 11 మందికి స్థానం చలనం కల్పించారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్గా ఉన్న దేవేందర్రెడ్డిని డీటీసీపీ డైరెక్టర్గా నియమించారు.
ఆయన స్థానంలో హెచ్ఎంఆర్ఎల్లో పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ నాయక్ను, డీటీసీపీ డైరెక్టర్గా ఉన్న విద్యాధర్ను హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్గా, హెచ్ఎంఆర్ఎల్ ప్లానింగ్ అధికారిగా మున్సిపల్, పట్టణాభివృద్ధిలో పని చేస్తున్న బాలకృష్ణకు పోస్టింగ్ ఇచ్చారు. బాలకృష్ణ స్థానంలో శివ శరణప్పను నియమించారు. రేరా కార్యదర్శి కూడా బాలకృష్ణ కొనసాగుతారు. జీహెచ్ఎంసీలో ఉన్న కే శ్రీనివాస్ను హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్గా నియమించారు. భవానిరాణి, బీఎస్ చంద్రిక, బీ ప్రదీప్కుమార్, బీ వెంకన్న, గంగాధర్కు పదోన్నతికి కల్పించారు.