Prakash Goud | తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఉద్దేశం సీఎం రేవంత్రెడ్డికి కూడా లేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, మూసీ సుందరీకరణ, బహదూర్పురా భూములపై ముఖ్యమంత్రిని కలిశానని వివరణ ఇచ్చారు. తన విజ్ఞప్తిపై సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారని ప్రకాశ్ గౌడ్ తెలిపారు. తనను ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారని అన్నారు.
రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రేవంత్రెడ్డితో దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. దీంతో ప్రకాశ్గౌడ్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రకాశ్ గౌడ్.. తాను కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని నిన్ననే స్పష్టం చేశారు. కాగా, సోమవారం మీడియా మాట్లాడిన ప్రకాశ్గౌడ్.. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని పునరుద్ఘాటించారు. తనపై బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానానికి నమ్మకం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత అధిష్ఠానానికి సమాచారం కూడా అందించానని పేర్కొన్నారు.