హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లిలో ఇటీవల బట్టలు ఉతుకుతూ చెరువులో పడి దుర్గమ్మ, బసమ్మ అనే మహిళలు మృతిచెందారు. శుక్రవారం రజక ఫెడరేషన్ ద్వారా రూ.50 వేల చొప్పున బాధిత కుటుంబాలకు అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్, ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ.. రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్తు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.