హైదరాబాద్, నవంబర్ 2 (నమ స్తే తెలంగాణ): తన స్వార్థం కోసం ఉపఎన్నిక తీసుకొచ్చిన బీజేపీ అభ్య ర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్పాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచ లం పిలుపునిచ్చారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు కో సం బీజేపీకి అ మ్ముడుపోయిన ఆయన్ను చిత్తుగా ఓడించాలని సూచించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజ యం ఎప్పుడో ఖాయమైందని, ఓటర్లు విజ్ఞతతో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. తాగునీటికి గోసపడిన మునుగోడు నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ తాగునీటిని అందించి ఫ్లోరైడ్ రూపుమాపారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేని బీజేపీ సరారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర పన్నుతున్నదని విమర్శించారు.