హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సోమవారం రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాజీనామా లేఖను అందజేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన రాజగోపాల్రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు రాజీనామా లేఖను స్పీకర్కు అందించానని, తన రాజీనామాను ఆమోదించారని పేర్కొన్నారు.