నల్లగొండ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేఏ పాల్ లాగా మారిపోయాడు.
జోకర్లా మాట్లాడుతున్నాడాని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. చండూరులో మీడియా సమావేశంలో ఆయాన మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి కి పిచ్చి ముదిరింది. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాట్లేదన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంటే రాజగోపాల్ రెడ్డికి దిమ్మ తిరుగుతున్నదన్నారు. రాజగోపాల్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప కూడా దాటవన్నారు. వెల్మకన్నే ఫీడర్ ఛానెల్ను పూర్తి చేస్తా అని హామీ ఇచ్చి మర్చిపోయాడు.
మా మంత్రి జగదీష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్. అడ్డగోలుగా మాట్లాడుతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మునుగోడులో తన అనుచరులను కాపాడుకోలేని రాజగోపాల్ రెడ్డి సూర్యాపేటకి పోయి రాజకీయాలు చేస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని దొంగ లాగా చూస్తున్నారు. అబద్ధాల ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి చరిత్రిలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు.