హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) డైరెక్టర్ జనరల్గా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజబాబు నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ బీహెచ్వీఎస్ నారాయణమూర్తి బుధవారం ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్ రాజబాబును నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాజబాబు ఏయూలో మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. 1988లో వైమానిక దళంలో కెరీర్ ప్రారంభించిన ఆయన 1995లో డీఆర్డీవోలో చేరారు. 35 ఏండ్ల సర్వీసులో విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణి వ్యవస్థల అభివృద్ధికి సేవలందించారు.
ఆర్సీఐలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ సామర్థ్యాల మెరుగుదలలో కీలకభూమిక పోషించారు. క్లిష్టమైన సాంకేతికతలు, మిషన్ మోడ్ ప్రాజెక్ట్ల అభివృద్ధి, క్రూయిజ్ క్షిపణులు, సాయుధ దళాల ఆయుధ వ్యవస్థల కోసం అధునాతన మిసైల్ ఏవియానిక్స్ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఆయన నేతృత్వంలోనే మన దేశం ‘మిషన్ శక్తి’ పేరిట తొలి ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆయన అత్యుత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డుతోపా టు డీఆర్డీవో సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్, విజ్ఞాన్ ప్రతిభా సమ్మాన్ తదితర అవార్డులను అందుకున్నారు.