జోగులాంబ గద్వాల : రైతన్న సినిమాను ఆదరించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నవరంగ్ థియేటర్ ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తితో కలిసి ఆదివారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రైతన్న సినిమా చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రంలోనీ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమా ఎంతో బాగుందన్నారు.
అన్నదాతల కష్టాలను నారాయణమూర్తి కళ్లక కట్టినట్లు చూపించారని ప్రశంసించారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాల్ని అందరూ ప్రోత్సహించాలన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.