కొనసాగుతున్న అల్పపీడనం.. వాతావరణశాఖ వెల్లడి
కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 11 సెంటీ మీటర్లు
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాగల రెండు రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో పాత రాజంపేటలో 11 సెంటీ మీటర్లు, గాంధారి, రామలక్ష్మణపల్లిల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.