హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఉత్తర బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తరువాత మరో 24 గంటల్లో బలపడి ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని వివరించింది.
కానీ శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.