హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోని ప్రభావంతో రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయలసీమ నుంచి తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొన్నది. దీని ప్రభావంతో పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది.