హైదరాబాద్ : తెలంగాణలో ఆదివారం అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు హైదరాబాద్ జీహెచ్ఎంసీతో పాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేటలో అత్యధికంగా 145 మిల్లీమీటర్లు, నల్గొండ జిల్లా నకిరేకల్ జిల్లాలో 117 మిల్లీమీటర్లు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రాలో 116.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది.