Weather Update | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో రాబోయే రెం డు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో గరిష్ఠంగా 32 డిగ్రీలు, కనిష్ఠంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. నైరుతి దిశగా ఉపరితల గాలు లు గంటకు 10-12 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల, మెదక్ జిల్లా రేగోడ్లో 4 సెం.మీ చొప్పున, భద్రాచలం కొత్తగూడెంలో 3 సె.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.