హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్ ఓఆర్ఆర్పై (ORR) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్రోడ్డుపై వెళ్తున్న కాంక్రీట్ రెడీమిక్స్ లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని దవాఖానకు తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. మృతుడిని పల్లె రాఘవేందర్గౌడ్గా గుర్తించారు. ఆయన మహబూబ్నగర్లోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారని చెప్పారు. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపువెళ్తుండగా శుక్రవారం అర్ధరాతి రాత్రి 2.15 గంటల సమయంలో జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.