Special Trains | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో 15 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. వేసవిలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నామని పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక రైళ్లు మే 1 నుంచి ఆగస్టు 2 వరకు షెడ్యూల్ వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు. పాట్నా-సికింద్రాబాద్, హైదరాబాద్-పాట్నా, దనపూర్-సికింద్రాబాద్, దనపూర్-బెంగళూరు వంటి స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వివరించారు. రైళ్లు, రిజర్వేషన్ వివరాలకు ఎస్సీఆర్ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.