హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మైత్రి మూవీ మేకర్స్ హవాలా లావాదేవీలపై ఈడీ దృష్టిసారించినట్టు విశ్వసనీయ సమాచారం. 3 రోజులపాటు 8 ఇన్కం ట్యాక్స్ బృందాలు.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆఫీసుల్లో, డైరెక్టర్ సుకుమార్ సహా నిర్మాతల ఇండ్లల్లో సోదాలు నిర్వహించాయి. సోదాల్లో హవాలా డబ్బు ఉన్నదా? అనే కోణంలో ఇప్పుడు విచారణ జరగవచ్చని సమాచారం. ఐటీ అధికారుల సోదా ల్లో లభించిన ఆధారాలతో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తున్నది. చేతులు మారిన డబ్బులు, ఫెమా చట్టం నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి వచ్చిన నగదుపై విచారించేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈడీ అధికారులు ఐటీ నుంచి సమగ్ర నివేదిక కోరినట్టు తెలిసింది. ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థపై ఐటీ దాడుల్లో మైత్రీ మూవీ మేకర్స్తో సంబంధాలున్నట్టు బయటపడ్డ విషయం తెలిసిందే.