శామీర్పేట, మే 7: తెలంగాణలోని కాంగ్రెస్ మొద్దులతో కలిసి రాహుల్ పప్పు బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. రైతులకు ద్రోహం చేసేందుకే కాంగ్రెస్ దద్దమ్మలు వరంగల్లో రైతు సంఘర్షణ సభ పెట్టారని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా ఉద్దెమర్రి, కేశవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తాపత్రయపడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు బట్టేబాజ్ మాటల మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను ఎందుకు అమలుచేయటం లేదని నిలదీశారు.