హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై స్థానిక బీజేపీ స్పాన్సర్డ్ దాడి హేయమని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకు లు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అలాంటి ధోరణి మంచిది కాదని హితవు పలికారు. రాహుల్ భద్రత విషయం లో సైతం అకడి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని, అలాంటి చర్యలతో ఆయన మానసిక ైస్థెర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించబోవని పేర్కొన్నారు. మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారని వెల్లడించారు. లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉన్నారని తెలిపారు.