రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
రాహుల్ వరంగల్ పర్యటన వల్ల రాష్ట్రానికిగానీ, దేశానికి గానీ ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్నే వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రకటించారని అన్నారు.
రాహుల్కు రాష్ట్రంపై, రైతులపై ఏమాత్రం అవగాహన లేదని వరంగల్ సభ ద్వారా తేటతెల్లం అయిందన్నారు. ధరణి పోర్టల్ను రద్దుచేస్తామనటం ద్వారా కాంగ్రెస్ మళ్లీ పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నదని అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూత పడింది కాంగ్రెస్ హయాంలోనేనని గుర్తుచేశారు.