హైదరాబాద్, జనవరి8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ కార్యదర్శిగా నియామకమైన రాహుల్బొజ్జా తొలిసారిగా ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సోమవారం భేటీ అయ్యారు. జలసౌధకు విచ్చేసిన ఆయనకు ఈఎన్సీ మురళీధర్, నాగేందర్రావు, అనిల్కుమార్, హరిరామ్తోపాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, వాటి పురోగతితోపాటు పలు అంశాలపై అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాహుల్బొజ్జాను హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.