హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) చైర్మన్గా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభు త్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కాళేశ్వరం నిర్మాణానికి కావాల్సిన నిధుల సమీకరణకు తెలంగాణ ప్రభుత్వం కేఐపీసీఎల్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ చైర్మన్గా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ వ్యవహరించాల్సి ఉన్నది. గత చైర్మన్ రజత్కుమార్ నవంబర్లో ఉద్యోగ విమరణ పొందారు. నాటి నుంచి చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉండటంతో ప్రస్తుత ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాను ఆ పోస్టులో నియమించింది.