Raging | వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మహిళా హాస్టల్లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడిన 81 మంది విద్యార్థినులపై శుక్రవారం అధికారులు వేటు వేశారు. వారం పాటు వారిని సస్పెండ్ చేశారు. అలా సస్పెండ్ అయిన విద్యార్థినుల్లో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విద్యార్థినులు ఉన్నారు.
ఇప్పటి వరకూ ర్యాగింగ్ విషయాల్లో అబ్బాయిలు ఉండే వారు. కానీ, ఇప్పుడు ర్యాగింగ్కు పాల్పడిన వారిలో అమ్మాయిల పేర్లు రావడం చర్చనీయాంశంగా మారింది. భారీ సంఖ్యలో విద్యార్థినులను సస్పెండ్ చేయడం కూడా హాట్ టాపిక్గా మారింది.