Raghunandan Rao | జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో రాజకీయాలతో పాటు ఇటీవల కాంగ్రెస్లో చేరిన జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని.. సమీకరణల మేరకు నేతలు పార్టీలు మారుతున్నారన్న ఆయన.. జితేందర్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ మారిన ఆయనకు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత జితేందర్రెడ్డికి ఉందా? అంటూ ప్రశ్నించారు. కుమారుడికి సీటిస్తే సిద్ధాంతం ఉంటుంది.. సీటు ఇవ్వకపోతే ఉండదా? అంటూ మండిపడ్డారు. త్వరలోనే జితేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి బాగోతాలను బయటపెడతామన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పార్టీలు మారామని చెప్పడంలో వాస్తవం లేదని.. ఆర్థిక లబ్ధి కోసమే పార్టీలు మారారని విమర్శించారు.
జితేందర్రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వకపోతే సిద్ధాంతం లేదా? అంటూ నిలదీశారు. మునుగోడు ఎన్నికల సమయంలో తననెవరూ కొనలేరన్న జితేందర్రెడ్డి ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ లబ్ధి కోసం రంజిత్రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లారో చెప్పాలన్నారు. రెండు కంపెనీలు, అక్రమ నిర్మాణాలపై విచారణ జరగాలని.. అక్రమ నిర్మాణాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. త్వరలో ఐటీ, ఈడీ అధికారులను సంప్రదిస్తామని స్పష్టం చేశారు.