హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్లో ఆదివారం వరుసగా నాలుగో రోజు ఆయనను ప్రశ్నించారు. విచారణ నిమిత్తం రాధాకిషన్రావును కోర్టు ఏడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో నల్లగొండకు చెందిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా దర్యాప్తు అధికారులు విచారణకు పిలిపించినట్టు తెలుస్తున్నది. గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో పనిచేసిన ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు.. అక్కడ ఫోన్ల ట్యాపింగ్కు ఉపయోగించిన టెక్నాలజీని తర్వాత బయట కూడా ఉపయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యలోనే వారిని పోలీసులు విచారణకు పిలిపించినట్టు సమాచారం.