హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. పంజాబ్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 900 గ్రాముల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.లక్షా 44 వేల నగదు, కారు, మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. కాగా, మధ్యాహ్నం 3 గంటలకు సీపీ మహేష్ భగవత్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.