భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయితోపాటు నార్మోటిక్ డ్రగ్స్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు చౌటుప్పల్ సమీపంలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి 294 కిలోల గంజాయి, నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడన గంజాయి విలువ 43.54 లక్షలు ఉంటుందని చెప్పారు. భువనగిరి ఎస్వోటీ, రామన్నపేట పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉన్నది.