కాచిగూడ, ఫిబ్రవరి 29 : రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల రూ.5 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రాజ్కుమార్ తదితరులు ఉన్నారు.