హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేవర కు ఉద్యమం ఆపేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ య్య తెలిపారు. కేంద్రం తక్షణమే స్పం దించి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో జనాభా ప్రకారం బీసీలకు వా టా కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జన గణనలో బీసీ గణన కూడా చేపట్టాలని, పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి ‘బీసీ యాక్టు’ను తీసుకురావాలని కోరా రు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రీమిలేయర్ను తొలగించాలని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని సూచించారు. జాతీయ స్థాయిలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, వీ హనుమంతరావు, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, భరత్ కుమార్, లాల్ కృష్ణ, రాజ్ కుమార్, పితాని ప్రసాద్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.