కొండాపూర్, మే 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ప్రధాన లక్ష్యంతో పని చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ బ్రౌచర్ను మంత్రి తన నివాసంలో ఆవిష్కరించారు. కేఎల్ వర్సిటీ నూతనంగా ప్రారంభిస్తున్న గ్లోబల్ బిజినెస్ స్కూల్ విజయవంతంగా ముందుకు సాగాలని యాజమాన్యానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యదర్శి కాంచనలత మాట్లాడుతూ.. మేనేజ్మెంట్ రంగంలో ఉత్తమ సేవలందించేందుకు కేఎల్ డీమ్డ్ వర్సిటీ నూతనంగా గ్లోబల్ బిజినెస్ స్కూల్ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. కొండాపూర్లో కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ను ప్రారంభించామని వెల్లడించారు. కొత్తగా మరో 10 టాప్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జీపీ సారథి వర్మ పాల్గొన్నారు.