హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ద్వారానే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. బీఆర్ఎస్కు భారత్లోని అన్ని వర్గాలతోపాటు అన్ని రాష్ర్టాల ఎన్నారైల నుంచి మద్దతు లభిస్తున్నదని చెప్పారు. ఫుట్బాల్ ప్రపంచకప్ 2022 పోటీల సందర్భంగా ఖతర్ చేరుకున్న బిగాలకు స్థానిక ఎన్నారై టీఆర్ఎస్ శాఖ ఘన స్వాగతం పలికింది.
టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని అధ్యక్షతన దోహాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని, తెలంగాణ మాడల్ భారత్కి రోల్మాడల్గా నిలుస్తున్నదని ప్రశంసించారు. ఫుట్బాల్ ప్రపంచకప్ సందర్భంగా ఖతర్ విడుదల చేసిన ప్రత్యేక కరెన్సీని ఎన్నారైలు మహేశ్ బిగాలకు అందజేశారు.