హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిం చే బిల్లును పా ర్లమెంట్లో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై అం దరూ ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజంలో సగభాగం, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో తాము సగభాగం ఇవ్వాలని కోరటం లేదని, తాము డిమాండ్ చేసే 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.