హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కరోనా కొత్త వేరియంట్ల వార్తల నేపథ్యంలో పోలీసులు మాస్క్ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బయట తిరిగేవారిపై 13,16,098 కేసులు నమోదు చేశారు. గస్తీ సిబ్బంది నిఘా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా రూ.వెయ్యి జరిమానాను విధిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరిగే ద్విచక్రవాహనదారుల బండి నంబర్ల ఆధారంగా కూడా కేసులు నమోదు చేస్తున్నారు. జరిమానాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద విధిస్తున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. మాస్క్ ఉల్లంఘన కేసులలో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నట్టు వివరించారు. అన్ని జిల్లాల్లోనూ మాస్క్ల ఉల్లంఘనపై మరింత దృష్టి పెట్టాలని పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.