హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో శాసనసభను నిర్వహిస్తున్న తీరు అద్భుతంగా ఉన్నదని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్సింగ్ సంధ్వాన్ కొనియాడారు. మంగళవారం ఆయన పంజాబ్కు చెందిన ఎమ్మెల్యే కుల్వంత్సింగ్ పండోరి, మాజీ ఎమ్మెల్యే అమర్జిత్సింగ్ తదితరులతో కలిసి రాష్ట్ర శాసనసభను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలు అర్థవంతంగా జరుగుతున్నాయని ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అద్భుతాలు చేస్తున్నదని, జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నదని మెచ్చుకున్నారు. ఆయనకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు స్వాగతం పలికారు.