హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, సాధించిన ఫలితాలను అధ్యయనం చేసేందుకు పంజాబ్కు చెందిన అధికారుల బృందం మంగళవారం రాష్ర్టానికి రానున్నది. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ రీజినల్ రిసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్జిత్ సింగ్, భూమి, నీటిపారుదల విభాగం శాస్త్రేవేత్తలు సంజయ్ సాత్పుతే, అబ్రార్ యూసుఫ్తో కూడిన బృందం బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్నది.
బుధవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లాకు వెళ్లి అక్కడి చెరువులు, చెక్డ్యామ్లను పరిశీలించనున్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజ్లాపూర్, కొమిరెడ్డిపల్లి, అడ్డాకల్ మండలం గౌరిదేవిపల్లి, రాచర్ల, నుస్రుల్లాబాద్ పెద్ద చెరువులను పరిశీలించనున్నారు. మిషన్కాకతీయ చెరువులు, చెక్డ్యాంలు, భూగర్భజలాల రీచార్జింగ్ విధానాలను తెలుసుకోనున్నారు. సాయంత్రం జలసౌధలో రాష్ట్ర సాగునీటిపారుదల, భూగర్భ జలశాఖల అధికారులతో పంజాబ్ బృందం సమావేశం కానున్నట్టు రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు.