సిద్దిపేట: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. కాలేశ్వరం నుంచి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉన్నదని, 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఇది 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని వివరించారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ను, తొగుటలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం భగవంత్సింగ్ మాన్ సందర్శించనున్నారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి తెలుసుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్తోపాటు గజ్వేల్ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్డ్యామ్లను పరిశీలిస్తున్నారు. అనంతరం హైదరాబాద్కి తిరిగి పయనమవుతారు.