Puls Polio | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమం జరగనున్నది. ఆదివారం నిర్దేశిత సెంటర్లలో పోలియో వ్యాక్సినేషన్ జరుగుతుందని, 4, 5 తేదీల్లో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుకలు వేస్తారని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వెల్లడించారు.
హైదరాబాద్లో 4, 6 తేదీల్లోనూ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 22,445 పోలియో బూత్లలో 40,57,320 మందికి పోలియో డ్రాప్స్ వేసేందుకు 910 మొబైల్ టీమ్స్, 910 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశామని, 2245 సూపర్వైజర్లు పర్యవేక్షిస్తారని, 8754 ఏఎన్ఎంలు, 28,160 ఆశాలు, 35,700 మంది అంగన్వాడీ సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు. 50.30 లక్షల డోసులను జిల్లాలకు పంపినట్టు తెలిపారు.