ములుగు: ములుగు మండలంలో పెద్దపులి (Tiger) కలకలం సృష్టించింది. మండలంలోని రాయినిగూడెం శివార్లలోని దేవుని గుట్ట అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులను స్థానికులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, నర్సంపేట పాకాల సమీప అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఇటుగా వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెల్లకూడదని సూచించారు.