హుస్నాబాద్ టౌన్: కరువుతీరా వానలు కురిసాయి.. కాకతీయుల కాలంలో నిర్మించిన ఎల్లమ్మ చెరువు నిండుగామారింది. చెరువు కట్ట కింద ఉన్న భూములన్ని పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా మారింది. కనుచూప మేర పచ్చని పొలాలతో పుడమి పచ్చకోక కట్టినట్లుగా మారింది.
ప్రతిఏటా వర్షాలు కురిసి రెండు పంటలకు జీవం పొస్తున్న ఎల్లమ్మ చెరువును చూసి రైతాంగం రెండు చెతులా మొక్కుతున్నారు. నీ కడుపు చల్లగా ఉంటే మా పొలాలు పచ్చగా ఉంటాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.