జనగామ : జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. సర్పంచ్ ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు తాటి కొండ సురేష్ కుమార్, ఎంపీపీ కందుల రేఖ భర్త కందుల గట్టయ్య, జఫర్గడ్ మండల ఎంపీపీ సుదర్శన్, జడ్పీటీసీ భర్త శ్రీనివాస్, రఘునాథ్పల్లి మండలం జడ్పీటీసీ కొల్లం అజయ్ కుమార్ను దళితబంధు పథకానికి ఎంపిక చేశారు. అయితే కొన్ని పార్టీలు తెలివి తక్కువ తనంతో వారిపై విమర్శలు గుప్పించాయి. మా కారణంగా ఎమ్మెల్యే రాజయ్యకు మచ్చ రాకూడదని ఉద్దేశంతో స్వచ్ఛందంగా తమకు వచ్చిన దళిత బంధు పథకాన్ని వద్దనుకుంటున్నామని మీడియా సమావేశంలో వారు తెలిపారు.