PUBG | చొప్పదండి, ఆగస్టు 3: పబ్జీ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో జరిగింది. ఎస్సై ఉపేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. రు క్మాపూర్కు చెందిన లంక అంజయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నా రు.
చిన్న కొడుకు రమేశ్(19) ఇంటర్ పూర్తి చేసి, తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ అడ్మిషన్ పొందాడు. తరగతులు ప్రా రంభం కాకపోవడంతో ఇంటివద్దే ఉం టున్నాడు. కాగా రమేశ్ మూడు నెలలుగా సెల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. గేమ్కు బానిస కావొద్దని తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన రమేశ్ బుధవారం సాయం త్రం గ్రామ శివారులోని సౌతు నూతి కుంట వద్ద గడ్డి మందు తాగాడు. గ్రామస్థుల సమాచారం మేరకు కుటుంబసభ్యులు రమేశ్ను వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు.