రంగారెడ్డి : రాజేంద్రనగర్(Rajendranagar)లోని హైదర్ గూడ చౌరస్తాలో నడి రోడ్డు పై సైకో(
Psycho) వీరంగం సృష్టించాడు. వచ్చి పోయే వాహనాల పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోనే ప్రయత్నం చేసిన వాహనదారుల(Motorists)పై సైకో చేయి చేసుకున్నాడు. అర్ద నగ్నంగా రోడ్డు పై కూర్చోని వాహనదారులను ఇబ్బంది కలుగజేశాడు. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కిందకు ఒక్కసారిగా దూసుకొని వెళ్లడంతో తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. వాహనదారులు బస్సు కింద నుంచి బయటకు లాగారు. సైకో చేష్టలతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.