హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ)ని బోధనా సిబ్బందికి మూలవేతనాన్ని (టైం స్కేల్) అమలు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు సోమవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని శ్రీనగర్లోని ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
మాడల్ స్కూళ్ల హాస్టల్కు కేటాయించిన అదనపు బాధ్యతలు తొలగించాలని, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో కేర్టేకర్లను నియమించాలని ఈ సంద ర్భంగా కోరారు. ప్రత్యేకాధికారిణి హోదాను ప్రిన్సిపాల్గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సంఘం నేతలు తెలిపారు. మంత్రిని కలిసిని వారిలో కేజీబీవీ ప్రతినిధులు ఝాన్సీ, మాధవి, సబిత, జయశ్రీ తదితరులు ఉన్నారు.