హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా నూతన వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయాలని పీఆర్టీయూ టీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారికి పీఆర్టీయూ టీఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. రెండో పీఆర్సీని అమలుచేయాల్సి ఉన్నందున జాప్యం లేకుండా కమిషన్ను ఏర్పాటు చే యాలని కోరారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ బడుల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారమయ్యే విధంగా కృషిచేస్తానని సీఎస్ హామీ ఇచ్చారు.