హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా స్థానచలనం కలిగిన టీచర్లను వెంటనే రిలీవ్చేయాలని పీఆర్టీయూ తెలంగాణ అధికారులను కోరింది.
మల్టీజోన్-1లో బదిలీ అయిన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లను బదిలీ అయిన స్థానంలోకి రిలీవ్చేయాలని పీఆర్టీ యూ తెలంగాణ అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి భిక్షంగౌడ్ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.